పేద బాలికలను చూసిన తర్వాత టీ షర్టు మాత్రమే ధరించాలనుకున్నా !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లో చిరిగిన దుస్తులతో చలితో వణికిపోతున్న ముగ్గురు పేద బాలికలను చూసిన తర్వాత టీ షర్టు మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఆ బాలికలు చలికి వణికిపోతుంటే రాహుల్‌ గాంధీ కూడా వణుకుతాడని వారికి సందేశం ఇవ్వాలనుకుంటున్నా'' అని రాహుల్‌ పేర్కొన్నారు. జోడోయాత్ర ప్రారంభమైనప్పటి నుండి టీ షర్ట్‌ మాత్రమే ఎందుకు ధరిస్తున్నారని, మీకు చలివేయడం లేదా అని అడుగుతున్నారని అన్నారు. హర్యానాలోని అంబాలాలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ.. మీరు ఎందుకు టీషర్టు మాత్రమే ధరిస్తున్నారు? మీకు చలిగా అన్పించట్లేదా? అని చాలా మంది అడుగుతున్నారని అన్నారు. యాత్ర ప్రారంభించినప్పుడు కేరళలో వాతావరణం వేడిగా ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టాక కాస్త చలిగా అనిపించింది. అయితే ఆ రాష్ట్రంలో యాత్ర జరుగుతున్నప్పుడు ఒకరోజు ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తుల్లో తన దగ్గరకు వచ్చారని, చలికి వణికిపోతున్న వారిని చూసి టీ షర్ట్‌ మాత్రమే వేసుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. శీతల వాతావరణం తనను గజగజ వణికించేలా చేసినప్పుడు స్వెట్టర్‌ గురించి ఆలోచిస్తానని, అప్పటిదాకా కేవలం టీషర్టుతోనే యాత్ర కొనసాగిస్తానని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)