అక్రమంగా సముద్రపు గుర్రాల తరలింపు !

Telugu Lo Computer
0


గుర్రాల ముఖాలను పోలిన చేపలను సముద్రపు గుర్రాలు అంటారు. ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. అందుకే వీటి వేటపై నిషేధం అమల్లో ఉన్నది. కానీ కొందరు అక్రమంగా చేపలతోపాటు వీటిని కూడా పట్టి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పచ్చివిగా, ఎండబెట్టి కూడా కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని నక్సల్‌బరిలో ఫయాజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఘోష్‌పుకూర్‌ రేంజ్‌లోని కుర్సియాంగ్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)