జమ్మూకాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని జిల్లా కోర్టు సముదాయం సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. అనుమానాస్పద వాహనాన్ని ఆపడానికి ఆర్మీ అధికారులు, పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనంలో ఉన్నవారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ అధికారులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకాశ్మీర్ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
January 17, 2023
0