ఎంపీ సుప్రియాకు తృటిలో తప్పిన ప్రమాదం !

Telugu Lo Computer
0

ఎన్సీపీ ఎంపీ, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సులేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో ఆమె చీరకు దీపం తగిలి ఒక్కసారిగా నిప్పంటుకుంది. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. సుప్రియా ఆదివారం పుణెలో ఓ కరాటే పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా ప్రమాదవశాత్తు దీపం తగిలి ఆమె చీరకు నిప్పంటుకుంది. అయితే, వెంటనే అప్రమత్తమైన ఆమె స్వయంగా మంటలను ఆర్పివేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అనంతరం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)