రెస్టారెంట్ అండ్ బార్‍పై రైడ్ - పోలీసులు షాక్ !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని ముంబై రెస్టారెంట్ అండ్ బార్‍పై రైడ్ చేసిన పోలీసులు లోపల చూసి షాక్ అయ్యారు. రహస్యంగా నిర్మించిన ఓ గదిలో 17 మంది మహిళలను చూసి అవాక్కయ్యారు. మరో నలుగురు మహిళలు బార్‌లో డాన్స్ చేస్తూ కన్పించారు. దహిసార్‌ ప్రాంతంలో ఈ దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది కస్టమర్లు, ఐదుగురు సిబ్బందితో పాటు బార్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. సీక్రెట్ రూంలో రహస్యంగా దాచిన 17 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఇలాంటి రైడ్లు చేసినప్పుడు మహిళలను కన్పించకుండా దాచాలనే నిర్వహకులు రహస్యంగా ఓ గదిని నిర్మించి బలవంతంగా వారిని అందులో ఉంచారని అధికారులు తెలిపారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)