యాసిడ్ దాడి కేసు లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు

Telugu Lo Computer
0


ఢిల్లీ ద్వారకానగర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగిన రెండవరోజు ఢిల్లీ కమీషన్ ఫర్ విమెన్ రెండు ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు జారీ చేసింది. యాసిడ్ దాడి కేసులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులేంటని ఆశ్చర్యపోవద్దు. నిందితులు వినియోగించిన యాసిడ్ ఫ్లిప్‌కార్డ్ నుంచి కొనుగోలు చేయడం, అదే యాసిడ్ అమెజాన్‌లో కూడా లభిస్తుండటం దీనికి కారణం. ఎందుకంటే యాసిడ్ ఇలా బహిరంగంగా అమ్మడం అక్రమమే.


Post a Comment

0Comments

Post a Comment (0)