ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లిన కారు

Telugu Lo Computer
0

హైదరాబాద్‌లోని బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో టిఫిన్‌ సెంటర్‌ వద్ద రోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ అయ్యిందంటేనే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టిఫిన్‌ సెంటర్‌ దగ్గర పార్క్ చేసి ఉన్న రెండు కార్లను అత్యంత వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)