వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే !

Telugu Lo Computer
0


బీహార్ లో మిత్రపక్షమైన కాంగ్రెస్ తో తనకు ఎలాంటి సమస్యలు లేవని సీఎం నితీష్ కుమార్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. బీహార్ లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం నితీష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 2.9 శాతానికి తగ్గడంపై నితీష్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము దానిని 2.0కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కుటుంబంలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండకూడదని చాలా మంది ఆంక్షలు విధించాలని అంటున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అందులో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఆడ పిల్లలు చదువుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)