భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది. తెలంగాణ పరిశీలకుడిగా గిరీష్ చోడంకర్ను, ఆంధ్రప్రదేశ్ పరిశీలకుడిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ నియమించింది. అలాగే పుదుచ్చేరికి హనుమంత రావు, మహారాష్ట్ర - పల్లం రాజు, అస్సాం -రంజీత్ రంజన్, బీహార్ - సుబోధ్ కాంత్ సహాయ్, ఛత్తీస్గఢ్ - అరుణ్ యాదవ్, ఢిల్లీ - డాక్టర్ మదన్ మోహన్ ఝా, గోవా - సాకే శైలజానాథ్, గుజరాత్ - హవేలీ, హర్యానా - సుభాష్ చోప్రా, హిమాచల్ ప్రదేశ్ - రఘువీర్ సింగ్ మీనా, జమ్మూ కశ్మీర్ - భరత్సింగ్ సోలంకి, జార్ఖండ్ - అర్జున్ భాయ్ మోద్వాడియా, కర్ణాటక - పృథ్వీరాజ్ చవాన్, మధ్యప్రదేశ్ - ప్రమోద్ తివారీలను ఏఐసీసీ నియమించింది
రాష్ట్రాల్లో కాంగ్రెస్ 'హాథ్ సే హాథ్ జోడో'
December 27, 2022
0