హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత

Telugu Lo Computer
0


హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జోరుగా డ్రగ్స్ తయారు చేస్తోన్న ఓ ముఠాపై పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. చర్చపల్లి, బోడుప్పల్ ప్రాంతాల్లోని రెండు ల్యాబ్ ల్లో డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠా నుంచి దాదాపు రూ.50కోట్లు విలువ చేసే 24 కేజీల మోఫిడ్రిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూతపడిన ఫాక్టరీల్లోని మిషనరీలు తెచ్చి మత్తు పదార్థాలు తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)