ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్దిని శశికళ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. రైలు దిగుతూ జారి పడి ట్రైన్ – ప్లాట్ ఫాం మధ్య చిక్కుకున్న విద్యార్దినిని గంటకు పైగా శ్రమించి కాపాడినా ప్రాణాలు దక్కలేదు. నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోవడంతో అవయవాలు దెబ్బతిన్నాయి. అంతర్గత రక్త స్రావం కావడంతో నిన్నటి నుంచి హాస్పిటల్ లో అత్యవసర చికిత్స అందించారు. చివరి క్షణం వరకు పోరాడి మరణించింది. దాదాపు గంటకు పైగా ట్రైన్ ను రైల్వే సిబ్బంది ఆపేసి ఫ్లాట్ ఫాంను తొలగించి రక్షించారు. అయినా శశికళ ప్రాణాలు దక్కకపోవడం విషాదం నింపింది. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె, స్టేషన్లో రన్నింగ్లో ఉన్న రైలు నుంచి దిగుతోంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ కిందికి జారిపోయింద. ఊహించని ఈ ఘటనతో ప్లాట్ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన ఆ యువతి గంటల తరబడి నరకం చూసింది.
దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడిన విద్యార్దిని మృతి
December 08, 2022
0
Tags