మినీ కట్టర్‌తో ప్రియుడిపై ప్రియురాలి దాడి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్, రోడ్ నంబర్.4 లోని ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మిసౌమ్య, అదే రోడ్డులోని ఓ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వీరిద్దరికీ స్థానికంగా ఉండే ఒక టీ స్టాల్ వద్ద పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు ఆమెను ప్రేమిస్తున్నాను, వివాహం చేసుకుంటాను అని తెలపటంతో పాటు ఆమె ఖర్చులు భరిస్తూ అశోక్‌ సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నెల 5న తేదీన రోడ్ నంబర్ 4లోని టీ స్టాల్ వద్ద ఇద్దరు కలిసున్న సమయంలో అశోక్ మళ్ళీ వివాహం చేసుకుందామనే ప్రస్తావన తీసుకుని రాగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న స్థానికులు ఎంత చెప్పిన ఇద్దరు గొడవ పెద్దదైంది.  కోపంతో ఊగిపోయిన సౌమ్య తనతో పాటు తెచ్చుకున్న మినీ కట్టర్‌తో అశోక్‌ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్ చెంప కింద భాగంలో తీవ్రగాయమయ్యింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అశోక్ ను తరలించారు.  ఈ ఘటనకు కారుకురాలైన సౌమ్యపై బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితురాలి పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో హౌసింగ్ బోర్డులో పెళ్లి ప్రస్తావని తీసుకురావడంతో అమ్మాయి తనతో తెచ్చుకున్న బ్లేడుతో అశోకుని గాయపరిచిందని పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ కి 50 కుట్లు వేసినట్లు డాక్టర్లు తెలిపారని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)