ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Telugu Lo Computer
0


ఒడిశాలోని కొందమాల్ జిల్లా మటకుప రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారు. దీంతో అలర్టైన బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందగా, మరికొందరు తప్పించుకున్నారు. మృతుల్లో ఒకరిని ఏసీఎం ర్యాంక్ కమలగా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు ఐజీ అమితాబ్ ఠాకూర్.

Post a Comment

0Comments

Post a Comment (0)