మగవాళ్ల ఫ్యాషన్, బ్యూటీ కాంటెస్ట్ మిస్టర్ ఇండియా. ఈ టైటిల్ని ఈ ఏడాది 21 ఏళ్ల మన తెలుగు కుర్రాడు తనుబుద్ధి సాయి భరద్వాజ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది మిస్టర్ టైటిల్ గెలుచుకున్న దేశవిదేశాల విజేతలు వచ్చే ఏడాది మార్చి నెలలో ఇండోనేషియా, బాలి దీవిలో జరిగే 'మిస్టర్ యూనివర్స్' టైటిల్కి పోటీ పడతారు. 'గ్లోబల్ మోడల్ ఇండియా' అనే ఆర్గనైజేషన్ ఈ పోటీలను నిర్వహించింది. ఒడిశా రాష్ట్రం పూరి పట్టణంలో నిర్వహించిన ఈ పోటీల్లో భరద్వాజ ఎథ్నిక్ వేర్ రౌండ్లో సంబల్పురి ఇకత్ చేనేత దుస్తుల్లో ఆకట్టుకున్నాడు. ఈ మిస్టర్ ఇండియా టూరిజమ్ విజేత ఒక ఏడాది పాటు దేశం నలుమూలలా పర్యటిస్తూ మన దేశ సంస్కృతి, కళలు, పర్యాటకరంగాలను ప్రభావితం చేయడానికి తన సేవలను వినియోగించాల్సి ఉంటుంది. తాను గమనించినంత వరకు దక్షిణాది రాష్ట్రాల పట్ల ఉత్తారాది ప్రజలకు ఉన్న చిన్నచూపును కొన్ని అపోహలను తొలగించడానికి తన పర్యటనల్లో ప్రయత్నం చేస్తానని చెప్పాడు భరద్వాజ. బీటెక్ చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పోటీలకు తనను తాను సిద్ధం చేసుకున్నాడు భరద్వాజ్. పోటీలకు సిద్ధం కావడం ద్వారా తనలో డిసిప్లిన్ దానంతట అదే అలవడిందని ఆఫీస్ పని ఒత్తిడిలో సాయంత్రం జిమ్ సాధ్యం కాకపోతే రాత్రి పదింటికి వ్యాయామం చేసిన సందర్భాలున్నాయని చెప్పాడు.
మిస్టర్ ఇండియాగా సాయి భరద్వాజ
December 09, 2022
0
Tags