ఈ నెల 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ అమ్మకాలను నిలిచిపోనున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి. లిక్కర్ అమ్మకాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ లిక్కర్ ను నిలువ చేయడం కానీ.. తరలించడం కానీ చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు.. ఎన్నకల కౌంటింగ్ డిసెంబర్ 7న జరగనుంది.
మూడు రోజుల పాటు లిక్కర్ బంద్
December 01, 2022
0
Tags