మహిళా నర్సుపై అత్యాచారయత్నం

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని మొహాలీలో కదులుతున్న ఆటోరిక్షాలో మహిళా నర్సుపై అత్యాచారయత్నం జరిగింది. ఆ మహిళ తనను తాను రక్షించుకునేందుకు కదులుతున్న ఆటోపై నుంచి దూకింది. ఈ ఘటన రద్దీగా ఉండే హైవేపై జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం నిందితులను అరెస్టు చేశారు. నిందితులు కదులుతున్న ఆటోలో మహిళపై అత్యాచారానికి యత్నించగా, ఆ మహిళ తనను తాను రక్షించుకోవడానికి రాయత్ బహరా ఆసుపత్రి సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపైకి దూకింది. నర్సుకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసుల చాకచక్యంతో బుధవారం ఆటోరిక్షా ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల పేర్లు మల్కిత్ సింగ్ అలియాస్ బంటి, మన్మోహన్ సింగ్ అలియాస్ మణి. బంటికి 24 ఏళ్లు కాగా, మణికి 29 ఏళ్లు. ఇద్దరూ సింగ్‌పురా కరౌలి గ్రామ నివాసితులు. రాత్రి 10 గంటల సమయంలో మల్కిత్ ఆటో రిక్షాలో మహిళ కూర్చున్నట్లు ఎస్ఎస్పీ సందీప్ గార్గ్ తెలిపారు. ఆమె ఖరార్ నుండి ఇంటికి తిరిగి వస్తోంది. మన్మోహన్ అప్పటికే ఆటో రిక్షా ఎక్కాడు. ఆటో హైవేపైకి చేరుకుని కరౌలి వైపు వెళ్తుండగా.. కదులుతున్న ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ధైర్యంగా పోరాడి నర్స్ తనను కాపాడుకుంది. నర్సు ఫిర్యాదుతో వెంటనే పలు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)