మా దగ్గర అణు బాంబు ఉంది జాగ్రత్త !

Telugu Lo Computer
0

తమ వద్ద అణుబాంబులు ఉన్న విషయాన్ని భారత్ మర్చిపోవద్దని పాకిస్తాన్ మంత్రి షాజియా మారీ బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. తమకున్న అణ్వస్త్రాల హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని హెచ్చరించినట్టు పేర్కొంది. దీనికి రుజువుగా తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న ఆమె పాక్ ఒక బాధ్యతాయుత అణు దేశమని ట్వీట్ చేశారు. దీనికి ముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని మోదీపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ హింసకు కారకుడు అని ఐరాస్ వేదికగా మాట్లాడారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ తిప్పికొట్టింది. అనాగరికంగా వ్యక్తిగత దాడికి దిగడం హేయమని చెప్తూ బీజేపీ శ్రేణులు శనివారం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో షాజియా మారి స్పందిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్టాడారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కంటే తమ దేశమే ఎక్కువ త్యాగాలు చేసిందని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)