హనీమూన్ లో విషాదం !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మఠం శోభ, రాజయ్యల కుమారుడు సంజయ్ బెంగళూర్ లో టెక్కీగా పనిచేస్తున్నాడు. నవంబర్ 28న బైలహోంగలకు చెందిన టెక్కీ ప్రీతితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అనంతరం కాపురం ఉండేందుకు బెంగళూర్ లోనే కిరాయికి ఓ ఇంటిని సైతం చూసుకున్నారు. డిసెంబర్ 12నే ఆ ఇంటిలో చేరాల్సి ఉంది, కానీ ఈ జంట హనీమూన్ కోసం వెళ్లింది. దగ్గర్లలో ఉన్న అన్ని ప్రాంతాలను చూస్తూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సిగందూరు చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సంజయ్-ప్రీతిలు ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. జిగళికి తిరుగుప్రయాణమై వస్తుండగా హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కొడద ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో వారిని దగ్గరలో ఉన్న రాణెబెన్నూరు హస్పిటల్ కు తరలించారు. తర్వాత దావణగెరెకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సంజయ్ మరణించాడు. దాంతో భర్త మరణం తట్టుకోలేక ప్రీతి కన్నీరు మున్నీరైంది. పోస్టు మార్టం అనంతరం సంజయ్ మృతదేహాన్ని జిగళి గ్రామానికి తరలించారు. పెళ్లై 20 రోజులు కాక ముందే నూతన జంటకు ఇలా జరగడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)