కచేరీపై నోట్ల వర్షం !

Telugu Lo Computer
0


గుజరాత్‌లో జరిగిన సంగీత కచేరీలో నోట్ల వర్షం కురిసింది. ఈ కార్యక్రమానికి హాజరైనవారు కళాకారులపై అభిమానంతో భారీ మొత్తంలో కరెన్సీ నోట్లు వెదజల్లారు. దీనిద్వారా సుమారు రూ.50 లక్షల మొత్తం సమకూరింది. నవసారి జిల్లా సూప గ్రామంలో 'స్వామి వివేకానంద ఐ మందిర్‌' ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కచేరీ జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రూ.50లక్షలను కంటి సమస్యలు ఉన్నవారి చికిత్స కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)