జనవరి నెల కీలకం !

Telugu Lo Computer
0


భారత్​లో కరోనా ఉద్ధృతి విషయంలో వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జనవరిలో కరోనా కేసులు గరిష్ఠస్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కరోనా వేవ్ సంభవించినప్పటికీ మరణాలు, ఆస్పత్రుల్లో చేరికలు చాలా తక్కువగా ఉంటాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. "తూర్పు ఆసియాలో కరోనా వేవ్ వచ్చిన 30-35 రోజుల తర్వాత భారత్​లో కొవిడ్ వేవ్ సంభవిస్తోంది. గత పరిణామాలను బట్టి ఇది ఓ ట్రెండ్​గా కొనసాగుతోంది" అని వైద్య శాఖ అధికారులు తెలిపారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నట్లు సమాచారం. ఆర్​టీపీసీఆర్ పరీక్షలతో పాటు ఎయిర్ సువిధ పోర్టల్​లో వివరాలు నింపడం కూడా తప్పనిసరి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, థాయ్​లాండ్, సింగపూర్, హాంకాంగ్ దేశాల ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తించనున్నట్లు వెల్లడించాయి. కాగా, గురువారం కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ దిల్లీ ఎయిర్​పోర్ట్​ను సందర్శించనున్నారని, పరీక్షల తీరును, స్క్రీనింగ్ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలిస్తారని అధికారులు చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ర్యాండమ్​గా పరీక్షలు కొనసాగుతున్నట్లు మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో 6వేల మందిని పరీక్షించగా, 39 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)