ఇంటర్​లో ప్రవేశాలకు మరోసారి అవకాశం

Telugu Lo Computer
0


తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం తరగతులు మొదలై 4 నెలలు గడిచాక మరోసారి ప్రవేశాలకు.. ఇంటర్మీడియట్ బోర్డు అనుమతించింది. తొలి ఏడాది ప్రవేశాలు జూన్‌లో మొదలు కాగా.. పలుమార్లు గడువును పొడిగిస్తూ చివరకు అక్టోబరు 15వ తేదీకి ముగించారు. తాజాగా నేటి నుంచి ఈ నెల 27 వరకు ప్రవేశాల గడువును పొడిగించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో బోర్డు తెలిపింది. ఇప్పటి వరకు 3.50 లక్షల మంది విద్యార్థుల పేర్లే బోర్డు లాగిన్‌ పరిధిలోకి వచ్చాయి. వారికి మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అర్హత ఉంటుంది. ఇంకా దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది ప్రవేశాలు బోర్డు ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదు. అది జరగాలంటే ఆయా కళాశాలల యాజమాన్యాలకు లాగిన్‌ అయ్యేందుకు బోర్డు అవకాశం ఇవ్వాలి. ఆ కళాశాలలకు అనుబంధ గుర్తింపు లేకపోవడంతో ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విద్యార్థుల కోసం ఈ గడువును పెంచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)