రైలు నుంచి కింద పడి తండ్రీకూతురు దుర్మరణం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 November 2022

రైలు నుంచి కింద పడి తండ్రీకూతురు దుర్మరణం


ఉత్తరప్రదేశ్‌లో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ మూడేళ్ల బాలిక కింద పడిపోయింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు ఆమె తండ్రి రైలు నుంచి బయటకు దూకాడు. ఆదివారం మిర్జామురాద్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బహెడా హాల్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్ట్‌ ప్రకారం.. 32 ఏళ్ల హీరా రైన్ తన భార్య జరీనా, కుమార్తె, బావ ఫిరోజ్‌తో కలిసి ఢిల్లీ నుండి బీహార్‌కు ప్రయాణిస్తున్నాడు. రైలులో కిక్కిరిసిపోయి సీట్లు దొరక్క కుటుంబసభ్యులు డోర్ దగ్గర కూర్చున్నారు. చిన్నారి రైలు నుండి పడిపోయినప్పుడు, ఆమెను రక్షించడానికి హీరా రైన్‌ వెంటనే బయటకు దూకాడు. అతని భార్య వెంటనే రైలును ఆపడానికి అత్యవసర గొలుసును లాగింది. మరికొందరు ప్రయాణికులు వచ్చి సహాయం చేయగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించారు. తండ్రిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, స్థానిక బంధువులకు సమాచారం అందించామని ఇన్‌స్పెక్టర్‌ మీర్జామురాద్‌, రాజీవ్‌సింగ్‌ తెలిపారు.

No comments:

Post a Comment