బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ నీరవ్ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. తనను భారత్కు అప్పగించకూడదన్న నీరవ్ అప్పీలును యూకే హైకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసుల విచారణ నిమిత్తం నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీరవ్ మోదీ ప్రస్తుతం ఆగ్నేయ లండన్లో ఉన్న వాండ్స్వర్త్ జైలులో ఉన్నాడు. భారత్కు అప్పగింతపై నీరవ్కు వ్యతిరేకంగా జిల్లా జడ్జి గత ఫిబ్రవరిలోనే తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు నీరవ్ మోదీ. తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని కోర్టులో ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో తనను భారత్కు అప్పగించొద్దని అభ్యర్థించారు. వీటన్నింటినీ పరిశీలించిన లండన్ హైకోర్టు.. కింది కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. నీరవ్ను భారత్కు అప్పగించాల్సిందేనని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల ఎగవేత సహా మోసం, మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కోసం నీరవ్ను భారత్కు అప్పగించాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెరేమీ స్టువర్ట్ స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే తీర్పుచెప్పారు.
నీరవ్ మోదీని భారత్కు అప్పగించండి !
November 09, 2022
0
Tags