మహిళా టెక్కీ ఆత్మహత్య

Telugu Lo Computer
0


కర్ణాటక, బెంగళూరు నగరం రామ్మూర్తి నగర రిచర్డ్‌ గార్డెన్‌లో శ్వేత ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. శ్వేతకు 11 నెలల క్రితం అభిషేక్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతడు టీసీఎస్‌ కంపెనీలో ఐటీ ఇంజనీర్‌. అభిషేక్‌కు పెళ్లికి ముందే ఓ యువతితో సంబంధం ఉంది. ఆ విషయాన్ని దాచి వివాహం చేసుకోవడమే కాక పెళ్లి తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం కాస్త శ్వేతకు తెలియడంతో దంపతుల మధ్య తరచు గొడవలు జరిగేవి. పెద్దలకు తెలియడంతో వారు పంచాయతీ పెట్టడం, రాజీ చేయడం కూడా జరిగింది. ఈ సంఘటనల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు బుద్ధిగా ఉన్న అభిషేక్‌ తర్వాత పాత బంధాన్ని కొనసాగించాడు. ఎన్ని సార్లు చెప్పినా అభిషేక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో మోసపోయానని విరక్తి చెందిన శ్వేత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకంది. ఈ నెల 10వ తేదీన జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నబిడ్డ మృతితో శ్వేత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తర్వాత అల్లుడి అక్రమ సంబంధం కారణంగానే తమ కుమార్తె మరణించిందని, అభిషేక్‌తో పాటు అతడి తల్లిదండ్రుల మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)