మా ఓటు మాత్రం టీడీపీకే !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా  పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు వింత సంఘటన ఎదురైంది. చేపల కూర పంపిస్తున్నాం తినండి. కానీ ఓటు మాత్రం టీడీపీకే అంటూ ఓ హోటల్ నిర్వాహకుడు ఎమ్మెల్యేకు స్పష్టం చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం వాడ్రేవుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చిట్టిబాబు గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ హోటల్ నిర్వాహకుడిని కలిశారు. అయితే, అతని నుంచి ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. 'మీరు జై జగన్ అన్నా.. మేం మాత్రం టీడీపీకే ఓటు వేస్తాం' అంట ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు తేల్చి చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఎమ్మెల్యే చిట్టిబాబుతో హోటల్ నిర్వాహకుడు పాపారావు మాట్లాడుతూ.. అమ్మ ఒడి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇవ్వకూడదని, వితంతు, వృద్ధాప్య పింఛన్లు వారి వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని పాపారావు కోరాడు. అంతేకాదండోయ్.. తన హోటల్ నుంచి చేపల కూర పంపుతున్నానని, అది తినాలని కూడా కోరాడు. అదే సమయంలో గట్టి షాక్ కూడా ఇచ్చాడు. తమ ఓటు మాత్రం టీడీపీకే అని తెగేసి చెప్పాడు పాపారావు. దాంతో ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు, నాయకులు కంగుతిన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)