ఉత్తర ప్రదేశ్‌ లో పరువు హత్య !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌ గోండాలో పరువు హత్య కలకలం సృష్టించింది. 16 ఏళ్ల టీనేజర్‌ను ఆమె సోదరుడే అత్యంత పైశాచికంగా హతమార్చాడు. మూడు నెలల కిందట పక్కింటి కుర్రాడితో వాట్సాప్‌ ఛాటింగ్‌ చేస్తూ ఆమె అన్న కంటపడింది. దీంతో ఆమెను చితకబాది, అతనికి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్‌లో మాట్లాడుతూ దొరికిపోవడంత ఆమెతో గొడవకు దిగాడు. ఏం చేస్తావో చేస్కో అంటూ తెగేసి చెప్పేసరికి ఆ అన్నలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ అతని కంటపడ్డారు. గురువారం రాత్రి ఓ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై కాట్రా బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)