ఓటర్లు బిజెపికి గుణపాఠం చెబుతారు !

Telugu Lo Computer
0


డిజిఫెస్ట్ 2022 సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, నాసి మౌలికవసతి గుజరాత్ ప్రజలను బాధిస్తున్నాయన్నారు. "ఒకప్పుడు రోడ్లు బాగుండేవి, ఇప్పుడు అలా లేవు. విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం లేదు. అవకాశం కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అతి తక్కువ జీతం ఉంటోంది. ఉద్యోగులు నిరాశతో ఉన్నారు. గుజరాత్ ప్రజల్లో అనేక భయాలున్నాయి" అని గెహ్లాట్ తెలిపారు. గుజరాత్‌లో బిజెపి గత 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పోటీపడుతున్నాయి. "గుజరాత్ మోడల్ అంటూ ఏమి లేదు. అంతా మోడీ మోడలే. ఇప్పుడు ప్రజలకు కూడా అది అర్థమైంది. సమస్యలు, బాధలు తీవ్రంగా ఉన్నాయి" అని అశోక్ గెహ్లాట్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)