తెలంగాణ లోని మెదక్ చర్చ్ బిషప్ ఏసి సాల్మన్ రాజుపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. ఈ విషయం పై సాల్మన్ రాజు మాట్లాడుతూ. తనకు ప్రాణహాని ఉందని, ఈ హత్యాయత్నానికి పాల్పడింది చర్చి సభ్యులేనని తెలిపారు. గత నెల అక్టోబర్ ఒకటో తేదీన జరిగిన చర్చి కమిటీ ఎన్నికల్లో తాను ఒక వర్గానికి మద్దతు ఇవ్వగా.. ప్రత్యర్థి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఆరాధన కార్యక్రమానికి రాజు వస్తుండగా దాదాపు 30 మంది కత్తులతో అతడి వాహనాన్ని చుట్టుముట్టారని, అప్రమత్తమమైన అతను కేకలు వేయడంతో అతని అనుచరులు సకాలంలో రావడంతో ఈ ఘటన నుంచి తప్పించుకున్నారు. తనని చంపాలనుకున్న 18 మందిపై జిల్లా ఎస్పీకి రాజు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారి వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశం ఉందని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బిషప్ సాల్మన్ రాజుపై హత్యాయత్నం !
November 13, 2022
0
Tags