దుండగులను చేజ్‌ చేసి పట్టుకున్న పోలీసులు

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాలో అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న దుండగులను పోలీసులు సినీ ఫక్కీలో చేజ్‌ చేశారు. దుండగుల కారును ఏకంగా 90 కిలోమీటర్లు చేజ్‌ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దుండగులు కారును వదిలి పారిపోయారు. అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఉదయం ఇండోర్‌లో ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై హర్యనా రిజిస్టర్డ్‌ కారును అడ్డగించారు. నలుగురు దుండగులు కారును ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మరింత వేగంగా పోనిచ్చారు. దాంతో పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఒకచోట దుండగులు పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టారు. చివరకు ఇండోర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని ఖల్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ బారీకేడ్‌లను ఢీకొట్టి కారును అక్కడే వదిలేసి నలుగురు దుండగులు పారిపోయారు. దాంతో కారులో వెతికిన పోలీసులకు భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. అందులో 40 పిస్తోల్‌లు, 36 మ్యాగజీన్‌లు, ఐదు క్యాట్రిడ్జ్‌లు ఉన్నాయి. ఈ ఆయుధాలు విదేశాల్లో తయారయినవని పోలీసులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)