నరబలి కోసం పసి బాలుడు కిడ్నాప్‌ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని గర్హి ప్రాంతానికి చెందిన ఒక గర్భిణీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో బాబుకు జన్మనిచ్చింది. కాగా, గురువారం ఒక మహిళ ఆ ఆసుపత్రికి వచ్చింది. రెండు రోజుల కిందట జన్మించిన పసి బాలుని కుటుంబాన్ని కలిసింది. తాను ఒక ఎన్జీవో సంస్థ సభ్యురాలినని వారితో చెప్పింది. బాబు ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని చెప్పి వారిని తన వెంట తిప్పింది. ఆ రోజు సాయంత్రం ఆ పసికందును ఆమె కిడ్నాప్‌ చేసింది. బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి పసి బాలుని కిడ్నాప్‌ చేసిన మహిళను గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితురాలిని 25 ఏళ్ల శ్వేతగా గుర్తించారు. బాలుని కిడ్నాప్‌పై ఆమెను ఆరా తీశారు. అయితే నవజాత శిశువును నరబలి ఇస్తే చనిపోయిన తన తండ్రి బతుకుతాడన్న మూఢ నమ్మకంతో ఈ పని చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)