ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కి.మీ లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
ఉత్తరాఖండ్లో భూకంపం !
November 06, 2022
0
Tags