రవీనా టాండన్ సఫారీ టూర్‌పై విచారణ

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వులో సఫారీ టూర్‌కు వెళ్లిన రవీనా టాండన్ అక్కడ ఓ పులి కనిపించేసరికి దానిని వీడియోలు, ఫోటోలు తీశారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులికి దగ్గరగా వెళ్లింది. ఆ వీడియోలు, ఫోటోలను రవీనా టాండన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె వాహనం పులికి దగ్గరగా వెళ్లిన సమయంలో అది గాండ్రించడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనం డ్రైవర్ అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నారు. వరల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టపడే రవీనా తరచూ ఇలాంటి సఫారీలకు వెళుతూ ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. ఈ క్రమంలోనే భోపాల్‌లో వనవిహార్ నేషనల్ పార్కులో కొందరు పులి ఉన్న ఎన్‌క్లోజర్‌పై రాళ్లు విసురుతున్న వీడియోను పోస్టు చేశారు. దీనిపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)