జవాన్ కాల్పుల్లో ఇద్దరు మృతి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 November 2022

జవాన్ కాల్పుల్లో ఇద్దరు మృతి !


గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 25 కి.మీ.ల దూరంలోని తుక్డా గోసా గ్రామంలో  ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్‌, తన సహచర జవాన్లపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మణిపూర్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా పునరావాస కేంద్రంలో ఉంటున్నారు. శనివారం బస్సులో ప్రయాణిస్తుండగా జవాన్ల మధ్య ఏదో విషయంలో గొడవ తలెత్తింది. దీంతో ఓ జవాన్ కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దారి తీసిన విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరు జవాన్లలో, ఒకరికి పొట్టలో, మరొకరికి కాలికి.. గాయాలు కాగా పోరుబందర్ జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి వారిని మెరుగైన చికిత్స కోసం 150 కిలోమీటర్ల దూరంలోని జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ జవాన్‌ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలిసిందని పోరుబందర్‌ జిల్లా కలెక్టర్‌ ఏఎం శర్మ తెలిపారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సె్స్‌తో పాటు గుజరాత్‌లో నియమించబడ్డారని ఆయన వెల్లడించారు. పోలీసుల నివేదికలో నిందితుడిని కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్‌గా గుర్తించారు. మరణించినవారిని తోయిబా సింగ్‌, జితేందర్‌ సింగ్‌గా, గాయపడినవారిని చోరజిత్‌ సింగ్‌, రోహికానగా గుర్తించామన్నారు. వారిలో ఒకరికి పొత్తికడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లగా, మరొకరి కాలుకు గాయమైందని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment