కర్ణాటకలో బీజేపీ నేత దారుణ హత్య - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 November 2022

కర్ణాటకలో బీజేపీ నేత దారుణ హత్య


కర్ణాటక లోని కలబురగి జిల్లా సేదమ్ టౌన్‌లో బీజేపీ నేత మల్లికార్జున ముత్యాలను గుర్తు తెలియని వ్యక్తులు దారణంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 64 ఏళ్ల మల్లికార్జున ముత్యాల తన ఎలక్ట్రానిక్ షాపులో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆయనను దారుణంగా హత్య చేసి, శరీరంలోని ముఖ్య భాగాలను ముక్కలుగా కత్తిరించారు. దుకాణంలోని వస్తువులు కానీ, సొమ్ము కానీ ఎక్కడివక్కడే ఉండటంతో ఇది దొంగతనం కోసం జరిగిన ప్రయత్నం కాకపోవచ్చని చెబుతున్నారు. ముత్యాల రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులకు కబురు పంపి వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ తెల్కూర్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల పని కావచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, పోలీసులు విచారణ జరుపుతున్నందున నిజానిజాలు తేలాల్సి ఉందని చెప్పారు. హత్యా ఘటన సమాచారం తెలియగానే వందలాది మంది ఘటనా స్థలికి చేరుకోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.

No comments:

Post a Comment