నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని శాంతివన్ లో నెహ్రూ స్మారకం వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూకు పుష్పాంజలి ఘటించారు. 1889 నవంబర్ 14 న ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జవహర్ లాల్ నెహ్రూ జన్మించారు. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. 1947లో ఆగస్టు 15న భారత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న ఆయన కన్ను మూశారు. జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజునే జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.
నెహ్రూ కి సోనియా, మోడీ నివాళులు
November 14, 2022
0
Tags