గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. సస్పెండ్ అయిన ఏడుగురు ఎమ్మెల్యేలు.. హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా. వీరంతా డిసెంబర్ 1న జరిగే తొలి విడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
ఏడుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ !
November 20, 2022
0
Tags