కైరళి న్యూస్, మీడియా వన్ ఛానల్ రిపోర్టర్లు వెళ్లిపోండి !

Telugu Lo Computer
0


కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రెస్ మీట్ ఉందంటూ మీడియాకు ఆహ్వానం పలికారు. దీనికి అన్ని శాటిలైట్ మీడియా ఛానళ్లు, వార్తా పత్రికల ప్రతినిధులు హాజరయ్యారు.  ప్రెస్ మీట్ కు వచ్చిన గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాత్రం రాష్ట్రంలోని సీపీఎం పార్టీకి చెందిన కైరళి న్యూస్, మీడియా వన్ ఛానల్ ఛానళ్ల ప్రతినిధుల్ని అక్కడి నుంచి పంపేశారు. వారు మీడియా ముసుగులో ఉన్న పార్టీ కార్యకర్తలు అంటూ వారిని ప్రెస్ మీట్ నుంచి బహిష్కరించారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోతేనే తాను మాట్లాడతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Post a Comment

0Comments

Post a Comment (0)