ప్రధానోపాధ్యాయుడిని చితకబాదిన గ్రామస్థులు

Telugu Lo Computer
0


కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరు తాలూకా సంకేనహళ్లి సమీపంలోని తరళబాళు విద్యాసంస్థకు చెందిన శివనంజుండేశ్వర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న నరేంద్ర పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని పదే పదే తన గదిలోకి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ నెల 7న అర్ధ పరీక్షలు ముగియగానే తన గదికి పిలిపించి వేధించాడు. దీంతో విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా ఈనెల 10న పోలీస్‌ స్టేషన్‌కు పిలిచారు. నరేంద్ర వెళ్లలేదు. శనివారం నేరుగా స్కూల్‌కు రావటంతో గ్రామస్థులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)