అయ్యప్పకు భారీగా ఆదాయం

Telugu Lo Computer
0


కేరళలోని ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత పది రోజుల్లో ఆలయానికి రూ.52.55కోట్ల ఆదాయం సమకూరిందని దేవస్వమ్‌ బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్‌ తెలిపారు. గతేడాది కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆలయానికి రూ.9.92కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయానికి వచ్చిన ఈ ఆదాయంలో మూడొంతులు ఉత్సవాల నిర్వహణకే వినియోగిస్తామని దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. మండలకాలం ప్రారంభం నుంచి అయ్యప్ప దీక్షాపరులు రావడం అధికం అవుతుందని, ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు శబరిమల ఆలయ అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)