బెంగళూరు రామచంద్రాపురంలోని ఆర్డీ ఇంటర్నేషనల్ స్కూల్లో 9 ఏళ్ల బాలిక 4వ తరగతి చదువుతున్నది. శుక్రవారం స్కూల్ టీచర్ పనిష్మెంట్ ఇవ్వగా ఆ విద్యార్థిని కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆ బాలిక తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇచ్చింది. దీంతో వారు బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కాగా, బాలిక మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్లో ఆమెకు శిక్ష విధించడంతో చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి వద్ద ఆరా తీయగా బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. బాలిక అనుమానాస్పద మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
స్కూల్ టీచర్ శిక్షకు బాలిక మృతి
November 06, 2022
0