పుట్టినరోజే ఆత్మహత్య చేసుకున్నాడు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని   మైసూరు నగరంలోని మండి మొహల్లాలో సోదరులు  గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్‌ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్‌లో పనిచేసే దర్శన్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ పడుతుంటాడు. ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో బాగా  తాగి వచ్చి ఇంట్లో గొడవ పడగా అతని తమ్ముడు మందలించాడు. దానితో దర్శన్‌ కేక్‌ తీసుకొని వచ్చి కట్‌ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)