మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలో ఓ బ్యాంక్ నుంచి రూ. 5 కోట్లు విలువ చేసే బంగారం చోరీ అయ్యింది. బీహార్ కు చెందిన ఓ దొంగల ముఠానే ఈ పని చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక బార్గవాన్ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకుకు సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఈ బ్యాంక్ ను టార్గెట్ చేశారని స్థానిక ఎస్పీ చెప్పారు. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకులతో సిబ్బందిని బెదిరించి దోచుకున్నారు. ముఠాలో ఉన్న వారంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారేనని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
బ్యాంకు నుంచి బంగారం చోరీ !
November 28, 2022
0
Tags