సత్యేందర్ జైన్‌కు జైలులో లగ్జరీ భోజనం

Telugu Lo Computer
0


ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జైలులో ఉన్న ఆప్ మంత్రి విలాస లీలల వీడియోలను రోజుకొకటి విడుదల చేయడం సంచలనం రేపుతోంది.ఆప్‌కి చెందిన సత్యేందర్ జైన్ తీహార్ జైలులో మసాజ్ చేస్తున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత జైన్ జైలు సెల్‌లో లగ్జరీ భోజనం చేస్తున్న వీడియోను బీజేపీ షేర్ చేసింది. మంత్రి జైన్ బయటి నుంచి వచ్చిన విలాసవంతమైన భోజనం చేస్తున్న వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బుధవారం విడుదల చేశారు. రేపిస్టు ఖైదీతో మసాజ్ చేయించుకోవడమే కాకుండా రిసార్ట్ లో ఉన్నట్లు సత్యేంద్ర జైన్ కు విలాసవంతమైన భోజనం అందించారు'' అని జైలు వీడియోను విడుదల చేస్తూ షెహజాద్ ట్వీట్ చేశారు. సలాడ్ లు, రుచికరమైన, పోషక విలువలున్న భోజనంతోపాటు వాటర్ బాటిళ్లు కూడా జైన్ వద్ద ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. తీహార్ జైలులో ఫ్రూట్-సలాడ్ డైట్‌ను కోరుతూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన విజ్ఞప్తిపై రూస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలు అధికారుల నుంచి స్పందన కోరిన ఒక రోజు తర్వాత ఈ వీడియో బయటపడింది. జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను సస్పెండ్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)