వచ్చే జూన్ 16న ఆదిపురుష్ !

Telugu Lo Computer
0


ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. టీజర్ చూసిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శలు వెల్లువెత్తాయి. గత కొన్నిరోజులుగా ఆదిపురుష్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా మీద వచ్చిన ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకొని గ్రాఫిక్స్, విజువల్స్ లో మరింత మార్పులు చేయాలని చిత్ర యూనిట్ భావించింది. దీంతో చాలా టైం కావాలి.  దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన సంస్కృతి, శ్రీరాముడికి చెందిన ఒక భక్తి, చరిత్ర. ఇందుకోసం ప్రేక్షకులకి మరింత మంచిగా ఈ సినిమాని చూపించడానికి మేము మరింత కష్టపడుతున్నాము. అందుకే సినిమాని వాయిదా వేస్తున్నాము. ఆదిపురుష్ సినిమా జూన్ 16, 2023లో రిలీజ్ అవుతుంది. మేము తీసే ఈ సినిమా చూసి ఇండియా గర్విస్తుంది. మీ సపోర్ట్ మాకు కావాలి' అని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)