తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయంలో ఒకే బాత్రూమ్లో రెండు కమోడ్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి. తమిళనాడు శ్రీపెరుంబుదూర్లో ఇటీవల అక్కడి ప్రభుత్వం రూ.1.80 కోట్లతో పరిశ్రమల శాఖకు సంబంధించిన ఒక కార్యాలయం నిర్మించింది. దీన్ని ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సీఎం ప్రారంభించిన ఈ బిల్డింగులోని ఒక బాత్రూమ్లో పక్కపక్కనే రెండు కమోడ్స్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ బిల్డింగ్ నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఒక బాత్రూమ్లో రెండు కమోడ్స్ ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండింటినీ ఇద్దరూ ఒకేసారి వినియోగించుకోలేరు. రెండోది నిరుపయోగమే. అలాంటప్పుడు రెండోది ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఒకే బాత్రూమ్లో రెండు కమోడ్స్
October 11, 2022
0
Tags