ముగిసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు

Telugu Lo Computer
0


సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సఫాయ్ లో ముగిశాయి. అభిమాన నేతను చివరిసారి చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియలకు రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో నేతాజీకి తుదివీడ్కోలు పలికారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ తండ్రి చితికి నిప్పంటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి కమల్ నాథ్, చత్తీస్ గఢ్ సీం భూపేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)