గుర్రంపై వచ్చి నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు.  మునుగోడు ఉపఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మునుగోడు బైపోల్లో ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున్న జనసమీకరణ చేసి ఆర్భాటంగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలులో ఓ అభ్యర్థి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన వీరభోగ వసంతరాయలు గుర్రంపై వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వృత్తిరీత్యా వైద్యుడైన వసంతరాయుడు హైదరాబాద్‌ పరిధిలోని ఎల్‌బీనగర్‌లో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇలా వినూత్నంగా గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అది చూసిన స్థానికులు భలేగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫొటోలు తీసి స్థానిక వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)