మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య

Telugu Lo Computer
0


కర్ణాటకలో కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో  శ్రీరామప్ప (69) తన భార్య సరోజ (55), కుమారుడు మనోజ్‌ (25), కూతురు అర్చనతో హండిగనాళలో ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్‌ నారాయణ స్వామిని ప్రేమించిన అర్చన సోమవారం ఇల్లు వదిలి అతనితో వెళ్లిపోయింది. అర్చన ఒక్కలిగ అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి కాగా, నారాయణస్వామి దళిత వ్యక్తి. కూతురు కనిపించడం లేదని అదే రోజు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో తమ పరువు పోయిందని, ఇక జీవించలేమని నిర్ణయించుకున్నారు. తమ మరణానికి అర్చనే కారణమంటూ సూసైడ్‌నోట్‌ రాసి పురుగుల మందు తాగి శ్రీరామప్ప, భార్య, కుమారుడు ప్రాణాలు తీసు కున్నారు. అదనపు ఎస్పీ కుశాల్‌ చౌక్సే, పోలీసు లు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే అందరం చచ్చిపో తామని అక్కకు తమ్ముడు మనోజ్‌ పంపిన మెసేజ్‌లను ఫోన్‌లో పోలీసులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)