వైరల్‌ అవుతున్న విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌

Telugu Lo Computer
0


పెళ్లైన 4 నెలలకే నయన్‌, విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో ఈ వార్త కాస్త కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంసంగా మారింది. సరోగసి ద్వారానే ఈ జంట తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో దూమారం రేగింది. సరోగసిపై నటి కస్తూరి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో విఘ్నేశ్‌ శివన్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన కొన్ని పోస్టులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ''నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ.. నీతోనే ఉండి.. నీకు అంతా మంచే జరగాలని కోరుకునే వారి గురించే ఆలోచించు. ఎందుకంటే వాళ్లే నీ వాళ్లు. ఎప్పటికీ ఇదే వాస్తవం. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ నిన్ను చేరతాయి. అప్పటి వరకూ సహనంతో వేచి ఉండు. ప్రతిక్షణాన్ని ఆస్వాదించు'' అని పోస్టు చేశారు. సరోగసి వార్తలు తెరపైకి రావడంతో తమిళనాడు ప్రభుత్వం సైతం స్పందించింది. వీరు నిబంధనల ప్రకారమే సరోగసి ద్వారా సంతానాన్ని పొందారా? లేదా? అనే విషయంపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్‌ విచారణకు ఆదేశించారు. సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్‌ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)