సీటు కోసం సిగపట్లు !

Telugu Lo Computer
0


ముంబై లోకల్ ట్రైన్లో ముగ్గురు మహిళలు ఎక్కారు. ఈ సమయంలో సీటు కోసం వారి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ పెరిగి పెద్దదైంది. ఒక్కసారిగా వారిలో కోపం కట్టలు తెచ్చుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దుర్భాషలాడుకున్నారు. ఇతర ప్రయాణికులు ఈ వివాదంపై జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గొడవలొద్దు అని ఎంత సర్ధిచెప్పినా వినకపోగా మరింత దాడి చేసుకున్నారు. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌ అయింది. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో ఏకంగా 3 లక్షల 76 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. అంతేకాదు 4వేల కంటే ఎక్కువ మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబయి అనే ఓ ట్విట్టర్ యూజర్... సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి వైరల్ అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)